పవర్ స్టార్ పవన్ కల్యాణ్!!…కాదు కాదు…జనసేన అధినేత పవన్ కల్యాణ్. అవును పవన్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు, పొలిటీష్యన్ కూడా. దాదాపుగా రాష్ట్ర రాజకీయాల్లో ఏ పదవి లేకపోయినా కీలక నాయకుడిగా ఎవరైన ఉన్నారు అంటే అది పవన్ మాత్రమే అని చెప్పాలి. సరే ఇదంతా పక్కన పెడితే…..పవన్ సినిమాల విషయంలో చాలా స్లోగా ఉంటాడు. ఒక సినిమా పూర్తి అయితే గాని మరో సినిమా చెయ్యడు.
అందుకే పవన్ కరియర్ గ్ర్యాఫ్ ఒక్కసారి పరిశీలిస్తే ఇన్ని ఏళ్లలో దాదాపు 20సినిమాలు కూడా చెయ్యలేదు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ మనసు మార్చుకున్నాడు. వీలైనంత త్వరగా..తాను నటిస్తాను అని అనుకుంటున్న ఆ రెండు లేదా మూడు సినిమాలు పూర్తి చెయ్యాలని ఆలోచనలో పడ్డాడు. వేగాన్ని పెంచాడు. రెండు, మూడు ఏంటి?? అనేది మీ సందేహం అయితే వినండి, పవన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమాలకి గుడ్ బై చెబుతానని ప్రకటించాడు. రెండు మూడు సినిమాలకి మించి చేయనంటున్నాడు. వచ్చే ఎలెక్షన్ లలో తన జనసేనని దించాలని ఈలోపు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. సమయం చాలా తక్కువుగా ఉన్నందున తన కరియర్ బండి స్పీడ్ పెంచి సర్దార్ షూటింగ్ పూర్తి కాక ముందే మరో సినిమా చేస్తున్నాడు.
ఈ విషయం కూడా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ ద్వారా అభిమాన సంద్రానికి తెలిసింది. శాస్త్రి గారు తన ట్విటర్ లో ఒక ‘సెల్ఫీ’ని పోస్ట్ చేశారు. ఇక ఆ ఫోటో ని బట్టి చూస్తే…ఆ ఫోటోలో ఎస్.జె.సూర్య, అనూప్ రూబెన్స్, రచయిత ఆకుల శివ సైతం ఉన్నారు. అంటే దాని అర్ధం ఏంటంటే….ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నాడని అర్థమవుతోంది. అలాగే ఆకుల శివ రచయితగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం పవన్ కరియర్ ను ఒక టర్న్ తిప్పిన ఖుషీ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో.