‘ఒక్కడు’ ఫీట్‌ను రిపీట్‌ చేస్తున్న క్రిష్‌

  • February 10, 2021 / 11:26 AM IST

తెలుగు సినిమాకు చార్మినార్‌కి కీలక సంబంధం ఉంది. ఎందుకంటే ఆ సెట్‌ టాలీవుడ్‌కి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చింది. అవును ‘ఒక్కడు’ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఇప్పుడు అదే చార్మినార్‌ మరోసారి కట్టబోతున్నారు. అదేనండి సెట్‌ వేయబోతున్నారు. అయితే ఈసారి మహేష్‌ కోసం కాదు… పవన్‌ కల్యాణ్‌ కోసం. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా కోసం భాగ్యనగరంలో మరోసారి చార్మినార్ సెట్‌ వేయబోతున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

17వ శతాబ్దం నేపథ్యంలో పవన్‌ – క్రిష్‌ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్‌ డ్రామాగా, శతాబ్దాల కిందట జరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ.ఎమ్‌.రత్నం నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో చార్మినార్‌ ఎలా కనిపించేదో… ఆ ప్రతిరూపాన్ని తీర్చిదిద్దబోతున్నారట. ఈ నేపథ్యంలోనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. మొఘల్ సామ్రాజ్యపు నాటి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ వజ్రపు దొంగల ముఠాకు నాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి 11న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తుండగా, బాలీవుడ్‌ భామ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నారు. ‘విరూపాక్ష’, ‘హరి హర వీరమల్లు’ లాంటి పేర్లు టైటిల్స్ కోసం ప్రచారంలో ఉన్నాయి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus