ఆ హీరోలు వద్దంటే.. విజయ్ – బన్నీ ఒప్పుకున్నారట!

  • January 28, 2021 / 03:01 PM IST

ఒక సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు కూడా సినిమా రిలీజ్ వరకు హ్యాపీగా కొనసాగుతుందో లేదో చెప్పలేము. కొన్ని పూర్తయ్యాక కూడా విడుదలకు నోచుకోవు. అయితే కథలు సెట్స్ పైకి రాకముందు హీరోల చుట్టూ తిరగడం కామనే. అలాగే ఒక మల్టీస్టారర్ కథ కూడా చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లి ఫైనల్ గా గీత ఆర్ట్స్ లో ఆగినట్లు సమాచారం. ఆనందో బ్రహ్మ, యాత్ర అనే సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ.

గత రెండేళ్ల నుంచి చేతిలో ఒక పవర్ఫుల్ మల్టీస్టారర్ కథను పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లిందట. ఒలరు ఒప్పుకుంటే మరొకరు కండిషన్స్ పెడుతూ వచ్చారట. ఇక ఫైనల్ గా గీత ఆర్ట్స్ కు రావడంతో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలతో సినిమాను తెరకెక్కించాలని ఆలోచనలో పడ్డారట.అయితే ఇదివరకు రిజెక్ట్ చేసిన వారిలో నాని, విశాల్ వంటి హీరోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ కలిసి బైలాంగ్యువల్ లో తీద్దామని అనుకోని కథలో కొన్ని చెంజెస్ కావాలని అడిగారట.

కానీ దర్శకుడు అందుకు ఒప్పుకోలేదట. ఇక బన్నీ, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కథలో పెద్దగా మార్పులు లేకుండా చేయడానికి ఒప్పుకునే ఆలోచనలో ఉన్నారట. దీంతో దర్శకుడు వారి రేంజ్ కు తగ్గట్లు సీన్స్ కు మరింత మసాలా యాడ్ చేస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus