లేటు వయసులో తల్లైన సీనియర్ హీరోయిన్..!

  • May 18, 2020 / 11:16 AM IST

సీనియర్ హీరోయిన్ సంఘవి అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘తాజ్ మహల్’ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. స్టార్ హీరోయిన్ల పోటీ ఎక్కువగా ఉన్న టైంలోనే .. తెలివిగా అలోచించి ఎక్కువ అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు స్టార్ హీరోల సరసన కూడా ఈమె నటించింది. ‘సూర్యవంశం’ సినిమాలో వెంకటేష్ తో … ‘సీతారామరాజు’ సినిమాలో నాగార్జునతో.. ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో బాలకృష్ణ తో… ‘మృగరాజు’ సినిమాలో చిరంజీవితో కూడా ఈ బ్యూటీ నటించింది.

అంతేకాదు ‘ఆంధ్రావాలా’ చిత్రంలో ఎన్టీఆర్ తో కూడా నటించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. అయితే తర్వాత ఈమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ తరుణంలో వెంకటేష్ అనే బిజినెస్ మెన్ ను 2016లో పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. సంఘవి పెళ్ళి చేసుకున్నప్పుడు ఆమె వయసు 39 ఏళ్ళు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అవును సంఘవికి ఆడపిల్ల పుట్టింది.

ఈ విషయాన్ని సంఘవి తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 42 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఈమె తల్లి కావడమేంటి అని ఎంతో మంది ఆశ్చర్యపోతున్నప్పటికీ.. ఈమెకు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అంతేకాదు ఈమె తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కూడా చాలా మంది కోరుకుంటూ రెప్లైస్ ఇస్తున్నారు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus