Actress: బిడ్డను కోల్పోయిన నటి.. నెలలు గడిచినా మర్చిపోలేక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • July 21, 2023 / 08:04 PM IST

నెలలు నిండిన గర్భిణీ స్త్రీలలో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడా? లేదా? అంటూ అదే ధ్యాసలో ఉంటారు. బిడ్డ కదలికలు తెలీకపోయినా వాళ్ళు కన్నీళ్లు పెట్టేసుకుంటారు. తల్లికాబోతున్నామనే మాటే వారికి మహా భాగ్యంగా ఉంటుంది. అలాంటిది డెలివరీ టైంలో బిడ్డకు ఏమైనా అయ్యింది అంటే.. ఆ తల్లి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి ఘోరమైన పరిస్థితినే ఎదుర్కొంటుంది ఓ నటి.

వివరాల్లోకి వెళితే… మంచు విష్ణు హీరోగా నటించిన రెండో సినిమా ‘సూర్యం’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సెలీనా జైట్లీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమె మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు. 2011 లో పెళ్లి చేసుకుని సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పేసింది. అయితే ఈమె రెండో సారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఓ బిడ్డను కోల్పోయింది. నెలలు నిండక ముందే ఓ బిడ్డను కోల్పోవడంతో..

ఆ షాకింగ్ న్యూస్ ని ఇప్పటికీ మరచిపోలేకపోతుంది. చనిపోయిన బిడ్డ పేరు ష్మాషర్ అట. ఇతను కవలల్లో ఒకడు అని తెలుస్తుంది. రెండో బిడ్డ అర్దూర్ అయితే ఏకంగా ఎన్.ఐ.సి.యు కి వెళ్లినట్టు ఆమె చెప్పుకొచ్చింది. మూడు నెలలు ఆ బిడ్డ అక్కడే ఉన్నాడట. ఆ టైంలో తన భర్త మొహం చూడటానికి చాలా సిగ్గు పడదని ఆమె చెప్పుకొచ్చింది. ఈమె (Actress) ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus