ఒకే వేదికపై కృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. వైరల్ అవుతున్న ఈ ఫోటో ఎప్పటిదో తెలుసా!

  • February 14, 2023 / 07:23 PM IST

సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను చూస్తే ఫ్యాన్స్, ఆడియన్స్‌కి భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.. అందుకే దాదాపు మల్టీస్టారర్లన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. ఎన్టీఆర్ – ఏఎన్నార్ జెనరేషన్ తర్వాత ఈ తరహా చిత్రాలు వచ్చింది చాలా తక్కువే.. కొంత కాలంగా మళ్లీ మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ స్టార్ట్ అయింది.. షూటింగ్ స్పాట్‌లోనో.. పర్సనల్‌గానో, ఫంక్షన్లలోనో తప్ప స్టార్ హీరోలు బయట కలిసే సందర్భాలు చాలా తక్కువే..

అయితే ‘సూపర్ స్టార్’ కృష్ణ, ‘మెగాస్టార్’ చిరంజీవి, ‘యువ సామ్రాట్’ నాగార్జున, ‘విక్టరీ’ వెంకటేష్, ‘యాంగ్రీ యంగ్ మెన్’ డా. రాజ శేఖర్, రమ్యకృష్ణ వంటి బిగ్ స్టార్లందరూ ఒకే వేదికపై ఉన్న అరుదైన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ పిక్ నాగార్జున – దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కాంబోలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ ఫిలిం ‘ఘరానా బుల్లోడు’ 100 రోజుల ఫంక్షన్ అప్పటిది.. కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, రాజ శేఖర్ అతిథులుగా విచ్చేశారు. సరదాగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫోటోలో చిరు – నాగ్‌ల బాండింగ్ కనిపిస్తుంది..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus