Sharwanand, Pawan Kalyan: ఒకరోజు ఆలస్యంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’!

  • February 18, 2022 / 05:33 PM IST

ఫిబ్రవరి 25, లేదంటే ఏప్రిల్ 1న పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ సినిమా ఫిబ్రవరిలో రాదని అందరూ అనుకున్నారు. అందుకే యంగ్ హీరోలు శర్వానంద్, వరుణ్ తేజ్ తమ సినిమాలను ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నాను. ఈ మేరకు అధికార ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు సడెన్ గా పవన్ కళ్యాణ్ బరిలో దిగదంతో చేసేదేం లేక వరుణ్ తేజ తన ‘గని’ సినిమా మార్చి 4కి పుష్ చేశారు.

Click Here To Watch

శర్వానంద్ మాత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో పవన్ తో పోటీకి వస్తున్నాయి. చెప్పిన తేదీ కంటే ఒకరోజు ఆలస్యంగా ఫిబ్రవరి 26న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. పవన్ సినిమాతో పోల్చుకుంటే.. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి దీనికి సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. పైగా ‘భీమ్లానాయక్’ ఫ్లో ఎక్కువైతే జనాలు తమ సినిమాను చూసే అవకాశాలు ఉంటాయని ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మేకర్స్ భావిస్తున్నారు.

కాబట్టి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఇలా పెద్ద సినిమాలతో పోటీగా దిగిన మీడియం అండ్ లో బడ్జెట్ సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు శర్వానంద్ సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి. ఈ సినిమాలో శర్వాకి జోడీగా రష్మిక నటించింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి కీలక పాత్రలు చేస్తుండగా.. కళ్యాణి నటరాజన్, సత్యకృష్ణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus