Aamani, Chiranjeevi: చిరంజీవి సినిమాలో నేనే హీరోయిన్ గా చేయాలి కానీ తీసేశారు : ఆమని

  • February 23, 2023 / 10:23 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1995 లో వచ్చిన రిక్షావోడు చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్ పై క్రాంతి కుమార్ నిర్మించారు. చిరు బ్యాడ్ ఫాంలో ఉన్న టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయంపాలైంది. అదే టైంలో రిలీజ్ అయిన ఆర్.నారాయణ మూర్తి ఒరేయ్ రిక్షా మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీంతో చిరు అభిమానులు బాగా హర్ట్ అయ్యారు.

ఒరేయ్ రిక్షా చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. ఇదిలా ఉండగా.. రిక్షావోడు చిత్రం పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం ఫ్లాష్ బ్యాక్ ను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వల్లే అనే కామెంట్లు వినిపించాయి. రిక్షావోడు లో హీరోయిన్లుగా సౌందర్య, నగ్మా నటించారు. సౌందర్య ని సెకండ్ హీరోయిన్ గా పెట్టడం కూడా చాలా మందికి నచ్చలేదు. ఇదిలా ఉండగా.. రిక్షావోడు సినిమాలో హీరోయిన్లుగా మొదట ఆమని, సౌందర్య ఎంపికయ్యారట.

మొదట ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడిగా ఎంపికయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడం కోడి రామకృష్ణ వచ్చి చేరడం జరిగింది. దర్శకుడు మారిన తర్వాత ఆమని ని తప్పించి ఆమె స్థానంలో నగ్మా ని ఎంపిక చేసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమని ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

చిరంజీవి గారు తనకు ఇష్టమైన హీరో అని.. సౌందర్య తన బెస్ట్ ఫ్రెండ్ అని .. వాళ్ళిద్దరితో కలిసి నటించే ఛాన్స్ మిస్ అవ్వడం తనను బాగా బాధపెట్టిందని అమని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus