అఖిల్ అవతలి వాళ్లకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు!

  • November 27, 2020 / 06:33 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అభిజిత్ కి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతడే బిగ్ బాస్ విన్నర్ అవుతాడనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చిన అభిజిత్ తల్లికి కూడా పాపులారిటీ పెరిగింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమెని ఇంటర్వ్యూ చేస్తూ అభిజిత్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నాయి. తాజాగా యాంకర్ రవి.. అభిజిత్ తల్లిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో హారిక తల్లి కూడా ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో అభిజిత్ తల్లి లక్ష్మీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

అభిజిత్ సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాడని.. అభితో పాటు తాము కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. అభి కోసం మూడు నెలల పాటు ఉప్పు లేని తిండి తిన్నామని చెప్పుకొచ్చింది. ఏది వండినా.. ఉప్పు, ఆయిల్ లేకుండా వండాల్సి వచ్చేదని తెలిపింది. ఇప్పటికీ అదే ఫుడ్ అలవాటు చేసుకున్నాడని వెల్లడించింది. సోహైల్, అరియానా సీక్రెట్ రూమ్ నుండి ఇంట్లోకి వచ్చినప్పుడు అభి అరిచాడని.. ఎక్కడ తనపై నెగెటివిటీ వస్తుందేమోనని టెన్షన్ పడ్డామని చెప్పింది. కానీ షో మొత్తం చూసాక.. చాలా సేపు ఓపిక పట్టిన తరువాత అలా అరిచాడని తెలిసి కూల్ అయ్యామని తెలిపింది.

ఇక బిగ్ బాస్ లో విలన్లు ఎవరనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. అమ్మా రాజశేఖర్, అఖిల్ ల పేర్లు ప్రస్తావించారు. వీరిద్దరూ కూడా ఎదుటివారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వరని, అవతలి వాళ్లు తమ రీజన్స్ చెప్పినప్పుడు వినడానికి సిద్ధంగా ఉండరని.. గట్టిగా అరవడం అనేది మంచి విషయం కాదని అన్నారు. అభిజిత్ కూడా మొదటినుండి అమ్మా రాజశేఖర్ కి అదే చెప్పుకుంటూ వచ్చాడని.. తన విషయంలో విలన్ అంటే అమ్మా రాజశేఖర్ అని వెల్లడించింది. అభిజిత్ విన్నర్ అయితే బాగుంటుందని తన కోరికను వెళ్లబుచ్చింది.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus