మెరుగుపడ్డ రాజశేఖర్ ఆరోగ్యం!

  • October 29, 2020 / 07:41 PM IST

కరోనా కారణంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా నుండి బయటపడలేక మృత్యువాత పడ్డారు. గత నెలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనా బారిన పడి మరణించారు. రీసెంట్ గా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆయన భార్య సైతం కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా కరోనాతో పోరాడుతున్నారని.. ఐసీయూలో ఉంచి ఆయనకి ట్రీట్మెంట్ అందిస్తున్నారనే వార్తలు రాగానే అందరూ కంగారు పడ్డారు.

మధ్యలో ఆయన కూతురు పరిస్థితి విషమంగా ఉందని.. ట్వీట్ పెట్టగానే ఫ్యాన్స్ మరింత కంగారు పడిపోయారు. ఆయనకి ఏం కాకూడదని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ప్రస్తుతం రాజశేఖర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుస్తోంది. హాస్పిటల్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. మరో రెండు రోజుల్లో రాజశేఖర్ ని ఐసీయూ నుండి సాధారణ వార్డుకి మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వేగంగా కోలుకుంటున్నారని.. రోజురోజుకి ఆరోగ్యం మరింత మెరుగుపడుతోందని రాజశేఖర్ భార్య జీవిత చెప్పారు.

రాజశేఖర్ ఒంట్లో అన్ని ఇన్ఫెక్షన్లు తగ్గినట్లు ఆమె చెప్పారు. ఐసీయూ నుండి బయటకి పంపే అవకాశాలున్నట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. కొన్ని వారాల క్రితం రాజశేఖర్ తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు. ముందుగా కూతుర్లు ఇద్దరూ కోలుకోగా.. ఆ తరువాత జీవితా ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం రాజశేఖర్ మాత్రం హాస్పిటల్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus