రాజకీయ నాయకుడు పై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఆరోపణలు…!

  • October 29, 2020 / 08:57 PM IST

గతంలో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అమీషా పటేల్… తాజాగా బీహార్‌లోని ఓబ్రా నియోజకవర్గం నుండీ ఎల్జేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ప్రకాశ్‌చంద్ర పై సంచలన ఆరోపణలు చేసింది.అందుకు సంబందించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఆమె మాట్లాడుతూ…”ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 26న నేను ఓబ్రా వెళ్ళగా…. అక్కడ ముందుగా నాతో చెప్పినదాని కంటే రెండు గంటలపాటు ఎక్కువ ప్రచారం చేయించుకున్నారు.

అదే టైంలో.. ప్రకాశ్ చంద్ర నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే కాదు నన్ను బెదిరించాడు కూడా..! నేను ముంబైకు చేరుకున్న తర్వాత కూడా ఆయన బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు పంపాడు. ప్రచారంలో ఉన్నప్పుడు ఓ గ్రామంలో నన్ను వదిలేసాడు. తనతో కలిసి రాకుంటే అక్కడే ఒంటరిగా వదిలేస్తాను అని చెప్పాడు. అతని కారణంగా నేను ఫ్లైట్ మిస్సయ్యాను.నేను అక్కడ ప్రాణభయంతో ఉన్నాను, నన్ను ఎక్కడ అత్యాచారం చేసి, చంపేస్తారో అని విలవిలలాడిపోయాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశాను.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus