ఫెమినిస్టులు ఎక్కువయ్యేది ఇందుకే : చాందినీ చౌదరి

  • October 31, 2020 / 05:32 AM IST

‘మధురం’ షార్ట్ ఫిలింతో బాగా ఫేమస్ అయిన చాందినీ చౌదరి.. ఆ తరువాత పలు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. ‘కుందనపు బొమ్మ’ ‘శమంతకమణి’ ‘మను’ ‘హౌరా బ్రిడ్జ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా…. చాందినీకి ఆశించిన స్రాథాయిలో బ్రేక్ రాలేదు. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కూడా నటించింది. కానీ ఆ చిత్రంలో ఈమెది పెద్ద ప్రాముఖ్యత కలిగిన పాత్ర కాదు. పైగా ఆ సినిమా కూడా నిరసపరిచింది కాబట్టి..

చాందినీకి అది కూడా ఏమాత్రం కలిసి రాలేదు. తెలుగు అమ్మాయి అవ్వడం వలనో.. లేక గ్లామర్ పాత్రలకు ఒప్పుకోదనో కానీ ఈమెకు అవకాశాలు కూడా ఎక్కువగా రావడం లేదు. ఏది ఏమైనా మె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడుతుంది. ఇటీవల ఈమె నటించిన ‘కలర్ ఫోటో’ చిత్రం ‘ఆహా’ లో విడుదల అయ్యింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో చాందినీ పోషించిన దీప్తి పాత్ర కూడా బాగా పండింది. మొత్తానికి చాందినీకి ఓ మంచి హిట్ దక్కింది.

అయితే ప్రేక్షకుల దగ్గర నుండీ క్రిటిక్స్, సెలబ్రిటీల వంటి వారు చాందినీ గురించి ప్రశంసించడం లేదు. ఈ విషయంలో చాందినీ బాగా హర్ట్ అయ్యింది.ఈ క్రమంలో ‘కలర్ ఫోటో’ కి సంబంధించిన ట్వీట్లను చాందినీ రీట్వీట్ చేస్తూ.. ‘ఇందుకే ఫెమినిస్టులు ఎక్కువయ్యి సమానత్వం కోసం పోరాడేది. నిజంగా ఇది చాలా బాదాకరమైన విషయం’ అంటూ పేర్కొంది. నిజమే… ఆమె ఆవేదన కూడా కరెక్టే మరి..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus