మెగా హీరోల పై జయసుధ షాకింగ్ కామెంట్స్..!

  • May 3, 2019 / 07:56 PM IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసుగుతున్న సంగతి తెలిసిందే. సహజనటి అంటూ ఈమె నటనని తెగ పొగిడేస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. తల్లి పాత్రలకి పెట్టింది పేరు జయసుధ. మహేష్ బాబు,చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకి తల్లిగా నటించింది జయసుధ. ప్రభాస్ ‘బిల్లా’ లో కూడా నటించింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఈమె నటించింది. ఇలా దాదాపు అందరి స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించింది. ఇదిలా ఉండగా జయసుధ తాజాగా ఈమె మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. త్వరలో రాబోతున్న ‘మహర్షి’ చిత్రంలో మహేష్ కు తల్లిగా నటించింది జయసుధ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధకి.. యాంకర్ నుండీ ‘మహేష్ బాబుకి, మెగాహీరోలకు తేడా ఏంటని..?’ ఎదురైంది. దీని పై జయసుధ స్పందిస్తూ.. ” ‘మెగాహీరోలు అంటే ఎవరు..?’ మీడియా వారు, ఫ్యాన్స్, ప్రొడ్యూసర్స్ మాత్రం మెగాఫ్యామిలీ అనుకుంటారు. కానీ కో ఆర్టిస్టులమైన మేము అలా ఎప్పుడూ భావించము, వారిని కూడా అందరిలానే నటులుగా చూస్తాము. మాతో కలిసి నటించబోయే హీరోలు కొత్తవారా..? నటనలో అనుభవం ఉందా..? అనే విషయాలే చూస్తాం తప్ప మెగాఫ్యామిలీ అనే తేడా ఏం ఉండదు, అంతకంటే మెగా మెగాలను చూశాము. ఎన్టీ రామారావు దగ్గర నుండీ ఇప్పటివరకు చాలామందిని చూశాం.. అది పెద్ద విషయం కాదు.మెగాఫ్యామిలీ నుండి వచ్చినా, మరే ఫ్యామిలీ నుండీ వచ్చినా ప్రతీ ఒక్కరూ కెమెరా ముందు తలవంచాల్సిందే. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది.. కొంతమంది మెగాఫ్యామిలీ నుండి వచ్చినా.. చాలా హంబుల్ గా ఉంటారు, కొంతమందికి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా యాటిట్యూడ్ చూపిస్తుంటారు” అంటూ జయసుధ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus