ఈవివి, తెలంగాణ శకుంతల గురించి ప్రముఖ నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • May 10, 2022 / 05:44 PM IST

ప్రముఖ నటి జ్యోతి అందరికీ సుపరిచితమే. సినిమాల్లో ఈమె వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తుంటుంది. ఈ మధ్య కాలంలో అయితే బిగ్ బాస్ సీజన్ 1, రాంగోపాల్ వర్మ తో కలిసి డ్యాన్స్ వీడియోలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దివంగత స్టార్ డైరెక్టర్ ఈవివి గురించి అలాగే దివంగత నటి తెలంగాణ శకుంతల గురించి, డ్రగ్స్ కేసు గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ.. “నేను నటించే సినిమాలకు సంబంధించి దర్శకుడు నాకు, నా పాత్రని వివరించే సమయంలో ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వాటికి నొ చెప్పేస్తాను. అయితే ఈవివి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి.. వారి పాత్రలకి సంబంధించిన విషయాలు ముందుగా చెప్పరు. షాట్ రెడీ అయినప్పుడే సీన్ వివరిస్తారు. ‘ఎవడి గోల వాడిదే’ షూటింగ్ టైములో కృష్ణ భగవాన్ కు, తెలంగాణ శకుంతల కి మధ్య బెడ్ రూమ్ సీన్స్ ఉన్నాయి.

ఆ సన్నివేశాల్లో తెలంగాణ శకుంతల నటించడానికి చాలా ఇబ్బంది పడింది. ఏడ్చేసింది కూడా..! కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. ఆ సీన్ ను కామెడీగా చూపించారు. ఇక ఆ సినిమా కోసం మమ్మల్ని బ్యాంకాక్ తీసుకెళ్లి 25 రోజులు ఉంచారు” అంటూ జ్యోతి చెప్పుకొచ్చింది.

ఇక డ్రగ్స్ కేసులో ఆమె ఇరుక్కోవడం పై స్పందిస్తూ.. ‘డ్రగ్స్ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నన్ను ట్రాప్ చేసింది ఎవరో నాకు తెలుసు. నన్ను అనవసరంగా ఇరికించినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో కుక్క చావు చచ్చారు’ అంటూ జ్యోతి షాకింగ్ కామెంట్స్ చేసింది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus