మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్..!

  • April 2, 2019 / 06:20 PM IST

మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగు,తమిళ భాషల్లో అగ్ర తారగా ఎదిగింది కీర్తి సురేష్. కేవలం స్టార్ హీరోల సినిమాలని మాత్రమే కాకుండా కథాబలం ఉన్న చిత్రాల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ గా వుంది. తెలుగులో మహేష్ కోనేరు నిర్మాణంలో నరేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న కీర్తి… హిందీ లో కూడా ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వీటితో పాటూ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను కూడా ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో యువరాణి కుందవాయ్ పాత్రలో కీర్తి కనిపించబోతుందని టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో కార్తీ , జయం రవి , మోహన్ బాబు , అమితాబ్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ వంటి స్టార్ కాస్ట్ కూడా కీలక పత్రాలు పోషిస్తున్నారట. ‘లైకా ప్రొడక్షన్స్’ తో కలిసి మణిరత్నం తన సొంత నిర్మాణ సంస్థ అయిన మద్రాస్ టాకీస్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే కీర్తి రేంజ్ మరింత పెరగడం ఖాయం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus