ఫిల్మీ ఫోకస్ ఇంటర్వ్యూ లో సునీల్ గురించి అనేక సంగతులు చెప్పిన మియా జార్జ్!

  • September 19, 2017 / 04:03 PM IST

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉంగరాల రాంబాబు. సునీల్ హీరోగా నటించిన ఈ సినిమా గతవారం రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించిన మియా జార్జ్ తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. అనేక విభిన్న పాత్రలతో మలయాళ, తమిళ పరిశ్రమల్లో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ .. తెలుగులో తొలి సినిమాతోనే సినీ ప్రముఖుల దృష్టిలో పడింది. అటువంటి మియా జార్జ్ ని ఫిల్మీ ఫోకస్ పలకరించగా అనేక సంగతులు పంచుకుంది. ముఖ్యంగా సునీల్ తనకి తెలుగు మాట్లాడడంలో, డ్యాన్స్ చేయడంలో సాయం చేశారని చెప్పింది. హైదరాబాద్ అంటే ఇష్టమని, బాహుబలి సినిమా అనేక సార్లు చూశానని మలయాళ బ్యూటీ  వివరించింది. ఇంకా మియా జార్జ్ చెప్పిన విషయాలు తెలుసుకోవాలనుంటే ఈ ఇంటర్వ్యూ చూసి తీరాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus