పూరి ప్లాన్ అప్సెట్ అయ్యింది.. నెక్స్ట్ ఏంటి?

  • May 7, 2019 / 03:49 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా రిజల్ట్ విషయం ఎలా ఉన్నా… షూటింగ్ పూర్తి చేయడం విషయంలో పూరి ప్లానింగ్ ఎప్పుడూ పక్కాగా ఉంటుంది. అయితే ఈసారి ‘ఇస్మార్ట్ శంకర్’ విషయంలో కొత్త సమస్య వచ్చి పడిందట. హీరోయిన్ నిధి అగర్వాల్ పాస్ పోర్ట్ పోయినందుకు ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా పడనుందట. అదేంటి పాస్ పోర్ట్ కు రిలీజ్ డేట్ కు సంబంధమేంటి అనేగా మీ డౌట్.

విషయమేమిటంటే.. ఈ చిత్రంలోని కొన్ని పాటల్ని యూరప్ లో చిత్రీకరించాలని పూరి ముందే ప్లాన్ చేసాడు. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ పాస్ పోర్ట్ పోవడంతో కొత్త పాస్ పోర్ట్ కు అప్లై చేస్తే టైం పడుతుందని పోలీసులు చెప్పారట. దీంతో ప్లాన్ అప్సెట్ అయ్యింది. మొదట ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో హైదరాబాద్ లోనే ఆ పాటల్ని పూర్తిచేసేద్దాం అనే ఆలోచనలో పూరి ఉన్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus