అయ్యయ్యో… రకుల్, మరీ ఇలానా ..?

  • March 16, 2019 / 03:48 PM IST

టాలీవుడ్ కి కెరటం అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆ చిత్రం వచ్చి వెళ్ళినట్టు కూడా చాలా మందికి తెలీదు అనడంలో సందేహం లేదు. దీని తరువాత సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంలో తన నటన, గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. ఇక అటు తరువాత వచ్చిన ‘లౌక్యం’ చిత్రం హిట్టు కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూలు కట్టాయి.

మహేష్ బాబు ,రాంచరణ్, జూ.ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కడంతో రకుల్ దూసుకుపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమెకు ప్లాపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో కోలీవుడ్ బాట బట్టింది. అక్కడ కూడా అమ్మడికి చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదు. ఈ సంవత్సరం రకుల్… ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో శ్రీదేవిగా కనిపించింది. అలాగే కార్తీ ‘దేవ్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.. అయినా సక్సెస్ వరించలేదు. ప్రస్తుతం రకుల్ ‘మన్మధుడు 2’ లో నటించడానికి రెడీ అవుతుంది.

ఈ చిత్రం కోసం ఏకంగా కోటిన్నర రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఇదిలా ఉండగా ప్రస్తుతం రకుల్ సింగపూర్ వెకేషన్‌ కి వెళ్ళింది. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుందని తెలుస్తుంది. నలుపురంగు బికినీ ధరించికుని హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తున్న రకుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జిమ్ముల్లో బాగా కష్టపడి.. ఎంతో స్లిమ్ అయిపోయిన ఈ అమ్మడిని చూసి నెటిజెన్లతో పాటూ రకుల్ అభిమానులు కూడా… ‘అయ్యో రకూల్ కాస్త బొద్దుగా ఉంటేనే బాగుంటుందేమో’ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus