Sri Reddy: శ్రీ రెడ్డి ఉసురు అభిరామ్ కి శాపంగా మారిందా?

  • June 5, 2023 / 01:07 AM IST

ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా చెన్నైలో ఉన్నటువంటి ఈమె పలు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి తనకు నచ్చన వారి పట్ల ఏదైనా మాట్లాడుతారు అంటే ఆ మాటలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎవరినైనా టార్గెట్ చేశారు అంటే వాళ్ళు ఈమె బూతు తిట్ల పురాణానికి బలి కావాల్సిందే.

అయితే తాజాగా ఈమె (Sri Reddy) సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ద్వారా నటుడు దగ్గుబాటి అభిరామ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతూ తిట్ల పురాణం అన్నారు. అయితే గతంలో అభిరామ్ శ్రీ రెడ్డిని నమ్మించి మోసం చేశారు. అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈయన హీరోగా అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో శ్రీరెడ్డి మరోసారి అభిరామ్ పై మండిపడ్డారు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకాధారణ సాధించుకోలేకపోయింది.ఇకపోతే ఈ సినిమా గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ తేజ పైన అలాగే అభిరామ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభిరామ్ ను ఉద్దేశించి చెప్పడానికి కూడా సాధ్యం కానటువంటి బూతు పదాలతో ఈమె ఆయనని దూషించారు. అదేవిధంగా డైరెక్టర్ తేజ పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

నా జీవితానికి సర్వనాశనం చేసిన వాడిని చెప్పుతో కొట్టకుండా ఇలా సినిమాలు చేస్తావా అంటూ తేజ పై కూడా మండిపడ్డారు. అయితే డైరెక్టర్ తేజ అని తిట్టడం ఇది మొదటిసారి కాదు గతంలో సీత సినిమా విడుదల సమయంలో కూడా శ్రీ రెడ్డి తేజ గారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus