అవకాశాలు తగ్గడంతో అందుకు ఒకే చెప్పిన అదా..!

  • September 19, 2017 / 10:28 AM IST

సాధారణంగా హీరోయిన్లు క్రేజ్ తగ్గాకో, సినిమా ఆఫర్లు లేకపోతేనో రియాలిటీ షోస్ అండ్ డ్యాన్స్ షోస్ కి హోస్ట్ లుగా, గెస్ట్ లుగా వ్యవహరించడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ.. బాలీవుడ్ లో రెండు హిట్లు, తెలుగులో పరిచయ చిత్రం “హార్ట్ ఎటాక్”తో నటిగా మంచి పేరు తెచ్చుకొన్న అదా శర్మ మాత్రం అప్పుడే ఓ రియాలిటీ డ్యాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించేందుకు సైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మా టివిలోని 70% షేర్స్ కొనేసిన స్టార్ ప్లస్ గ్రూప్.. బాలీవుడ్ లోని ప్రోగ్రామ్స్ అన్నిట్నీ దాదాపుగా తెలుగులోనూ చేయిస్తోంది. మొదటి ప్రయత్నంగా ఎన్టీయార్ హోస్ట్ గా “బిగ్ బాస్”ను ప్రారంభించగా షో సూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు అదే ఫార్మాట్ లో హిందీలో బాగా సక్సెస్ అయిన “నాచ్ బలియే” ప్రోగ్రామ్ ను తెలుగులో ప్రొడ్యూస్ చేయనుంది. ఈ డ్యాన్స్ షోకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించనుండగా.. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ ఒక జడ్జ్ గా వ్యవహరించనున్నారు. ఆమెతోపాటు అదా శర్మ కూడా మరో జడ్జ్ గా కార్యక్రమాన్ని రంజింపజేయనుందట. మరి సదా, ప్రియమణిల తరహాలో అదా కూడా వెండితెరకు గుడ్ బై చెప్పేసి బుల్లితెరకు పరిమితమైపోతుందా లేక వెండితెరతోపాటు బుల్లితెరను కూడా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus