ఐదు గ్రామాలను దత్తత తీసుకుని అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆదిత్య ఓం

  • November 17, 2020 / 09:15 PM IST

టాలెంటెడ్ హీరో ఆదిత్య ఓం గత ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలకోసం సేవ చేస్తూ..ఐదు గ్రామాల్లోని ప్రజల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి పరిసర ప్రాంతాలను దత్తత తీసుకొని వారికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అందరూ కొనియాడుతున్నారు.. రీసెంట్ గా ఆదిత్య ఓం చేరుపల్లి లోని ఐదు గ్రామాల్లోని దాదాపు 500మందికి ప్రజలకు మామిడి, కొబ్బరి విత్తనాలను సప్లై చేసి తన మిత్రుడు నిర్మాత పివియస్ వర్మ కలిసి అందించారు.

అంతేకాకుండా గ్రామీణ యువతీయువకులకు విద్యతోపాటు క్రీడా రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రపంచాన్ని అనుకరించడానికి అనువైన గ్రామంగా చేరువల్లి గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆదిత్య ఓం “బందీ” అనే ఒక ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం సింగిల్ పాత్ర మాత్రమే ఆదిత్య ఓం పోషించడం విశేషం. తెలుగు, తమిళ్ భాషల్లో బైలాంగ్వేల్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాఘవ టి. దర్శకత్వం వహిస్తున్నారు..

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus