లీగల్ ఇష్యూస్ లో చిక్కుకున్న అడివి శేష్..!

  • December 29, 2020 / 12:50 PM IST

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేస్తూ.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్. ఓ పక్క క్యారెక్టెర్ ఆర్టిస్ట్ గా కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో పై… కేసు నమోదు అయ్యిందా? అంటే అవునని చెప్పలేము కానీ ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయనేది తాజా సమాచారం. విషయం ఏమిటంటే.. జీవిత రాజశేఖర్ ల పెద్ద కూతురు శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ అడివి శేష్ హీరోగా ‘టూ స్టేట్స్’ అనే చిత్రం రూపొందాల్సి ఉంది.

కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుండీ అడివి శేష్ తప్పుకున్నాడని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అందుకే ఈ ప్రాజెక్టు ఆగిపోయినంటూ కథనాలు వినిపించాయి. అయితే ఈ విషయాల పై అటు హీరో, హీరోయిన్లు కానీ దర్శకనిర్మాతలు కానీ క్లారిటీ రాలేదు. ఈ చిత్రం కోసం శేష్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. కథ నచ్చకపోతే స్క్రిప్ట్ లో మార్పులు అయినా చేయించుకోవాలంటూ నిర్మాత శేష్ కు సర్దిచెప్పినా అతను వినలేదని టాక్.

అంతేకాకుండా తన సినిమాకి ఇవ్వాల్సిన డేట్స్ ను ‘మేజ‌ర్’ మూవీకి ఇవ్వడంతో నిర్మాత బాగా హర్ట్ అయ్యాడని ఇన్సైడ్ టాక్.అందుకే ‘టూ స్టేట్స్’ నిర్మాత ఎం.ఎల్.వి సత్యనారాయణ కోర్టుకెక్కాలని డిసైడ్ అయినట్టు తాజా సమాచారం. ‘లీగ‌ల్ గా అయినా తనకు న్యాయం జరిగేలా చూడాలని’ నిర్మాత న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల అడివి శేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus