కీర్తి సురేష్ మొదటి చిత్రం కూడా ఓటిటిలోనే విడుదల కాబోతుందా?

  • August 15, 2020 / 01:28 PM IST

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో.. ఓటిటిలకు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే విడుదల కాని సినిమాలకు మంచి ఆఫర్ వస్తే దానిని ఓటిటిలో విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు రెడీగా ఉన్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. పైన హెడ్డింగ్ చూసిన ప్రతీ ఒక్కరికి కొత్త అనుమానం రావడం గ్యారెంటీ..! ఎందుకంటే కీర్తి సురేష్ చిత్రం ‘పెంగ్విన్’ డైరెక్ట్ గా ఓటిటిలో (అమెజాన్ ప్రైమ్) విడుదలయ్యింది ఓకే..! తరువాత ఆమె ‘మిస్ ఇండియా’ చిత్రం కూడా ఓటిటిలోనే విడుదల అవుతుంది అంటున్నారు.

అది కూడా ఓకే..! కానీ కీర్తి సురేష్ మొదటి చిత్రం ఇప్పుడు ఓటిటిలో విడుదలవ్వడం ఏంటి? ‘నేను శైలజ’ విడుదలయ్యి 4 ఏళ్ళు పైనే అయ్యింది కదా? అని కన్ఫ్యూజ్ అవ్వకండి. విషయం ఏమిటంటే.. ‘నేను శైలజ’ చిత్రం కంటే ముందే కీర్తి సురేష్ ఓ చిత్రంలో నటించింది. ఆ చిత్రం పేరు ‘ఐనా ఇష్టం నువ్వు’. ఈ చిత్రంలో నరేష్ గారి అబ్బాయి నవీన్ హీరోగా నటించాడు. నిజానికి ఇదే అతని డెబ్యూ చిత్రం అవ్వాల్సి ఉంది.కీర్తి సురేష్ కు కూడా ఇదే డెబ్యూ మూవీ అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విడుదల కాలేదు. 5 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు.

అవును.. ‘ఐనా ఇష్టం నువ్వు’ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేయబోతున్నారట. రాంప్రసాద్ రగుటు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘ఫ్రెండ్లీ మూవీస్’ బ్యానర్ పై అడ్డాల చంటి నిర్మించాడు. ఆర్ధిక లావాదేవీల కారణంగా ఈ చిత్రం అప్పుడు విడుదల కాలేదు. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ క్రేజ్ బాగా పెరిగింది కాబట్టి ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయమంటూ కొన్ని డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు ముందుకు వస్తున్నాయట. అన్నీ అనుకున్నట్టు జరిగితే కీర్తి సురేష్ డెబ్యూ మూవీని కూడా మనం చూసే ఛాన్స్ ఉంటుంది.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus