Aishwarya Rajesh: ఎమోషనల్ అయిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!

  • July 6, 2021 / 10:52 PM IST

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఈశ్వరి రావు హీరోయిన్ గా నటించిన ‘రాంబంటు’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. ఆ చిత్రంలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శ్రీలక్ష్మికి ఐశ్వర్య రాజేష్ దగ్గర బంధువు. ప్రస్తుతం ఈమె వరుస తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

తెలుగులో కూడా ఈమె ‘కౌసల్య కృష్ణమూర్తి’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాల్లో నటించింది.త్వరలో ‘టక్ జగదీష్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది ఈ బ్యూటీ. తాజాగా ఐశ్వర్య రాజేష్ చేసిన కొన్ని ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.వివరాల్లోకి వెళితే.. ఐశ్వర్య రాజేష్ అభిమానుల నుండీ ఓ వ్యక్తి డబ్బులు తీసుకుని, ఆమెకు సంబంధించిన విషయాలను లీక్ చేశాడట. ఇది తెలిసిన తర్వాత ఆమె షాక్ కు గురైనట్టు తెలిపింది.

‘నా వెంటే ఉంటూ నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడని ఊహించలేదు’ అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేసింది. అటు తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సన్నిహితులు కోరారని కూడా ఆమె తెలిపింది. అయితే.. తప్పు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి… లైట్ తీసుకుని ఇకనుండీ జాగ్రత్తగా పడాలని ఈమె నిర్ణయించుకున్నట్టు తెలిపింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus