‘విశ్వాసం’ సెన్సార్ పూర్తి..!    

  • December 24, 2018 / 01:06 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంతా అంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులని పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ U సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. మాస్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తుండగా శివ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ ఉన్నాయట. ఎమోషన్స్ కూడా బాగా పండించినట్టు తెలుస్తుంది. ఇమాన్ సంగీతంతో పాటు నేపధ్య సంగీతం కూడా బాగా వచ్చిందట. అజిత్ ద్విపాత్రాభినయంతో మరోసారి ఆకట్టుకోబోతున్నాడట. ముఖ్యంగా అజిత్, నయనతార మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుంటాయని తెలుస్తోంది. గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన ‘వీరం’ ‘వేదలమ్’ చిత్రాలు మంచి విజయాన్ని నమోదు చేసాయి. మధ్యలో వచ్చిన వివేఘం చిత్రం నిరాశపరిచినప్పటికీ మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. అయితే తెలుగులో సంక్రాంతికి గట్టిపోటీ ఉండటం వలన ‘విశ్వాసం’ చిత్రాన్ని కొంచెం గ్యాప్ తీసుకుని తెలుగులో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus