ఓ పక్క చైతన్య- అఖిల్ , మరోపక్క సాయి తేజ్, వైష్ణవ్ తేజ్..!

  • May 19, 2020 / 06:45 PM IST

లాక్ డౌన్ వల్ల అటు మెగా ఫ్యామిలీ.. ఇటు అక్కినేని ఫ్యామిలీల్లో ఒకే సమస్య వచ్చి పడింది. అదేంటో ఈ పాటికే మీరు అర్ధమై పోయి ఉంటుంది. ఈ సమ్మర్ కే మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా విడుదల కావాల్సి ఉంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వద్ద ఆగిపోయింది. ఆ తరువాత అన్నయ్య సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని మే 1 న విడుదల చేద్దాం అనుకున్నారు.

యువ దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఆగిపోయింది.లాక్ డౌన్ ముగిసి ఉంటే.. బొమ్మ పడి 10 రోజులు అయ్యేది. ఇలా మెగా ఫ్యామిలీలో అన్నదమ్ముల సినిమాలకు బ్రేక్ పడినట్టు అయ్యింది. కేవలం మెగా ఫ్యామిలీలో మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీలో కూడా ఇలాంటి సమస్య వచ్చి పడింది. అవును అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ చిత్రాన్ని మొదట ఏప్రిల్ లో విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజ హెగ్దే హీరోయిన్. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

ఈ చిత్రం విడుదలయ్యాక నాగ చైతన్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతోన్న ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేశారు. సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది కాబట్టి అంచనాలు పెరిగాయి. కానీ ఈ చిత్రం షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇలా విచిత్రంగా అటు మెగా ఫ్యామిలీ.. ఇటు అక్కినేని ఫ్యామిలీల్లో బ్రదర్స్ సినిమాలకు బ్రేక్ పడినట్టయ్యింది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus