ఆహ్వాన పత్రికను సిద్ధంచేసిన అక్కినేని నాగార్జున

  • November 2, 2016 / 07:23 AM IST

అక్కినేని నాగార్జున, అమల ముద్దుల తనయుడు అఖిల్, శ్రీయ ల నిశ్చితార్ధ తేదీ ఖరారు అయింది. బంధు మిత్రులను పిలిచేందుకు ఆహ్వాన పత్రికను నాగ్ సిద్ధం చేశారు. వచ్చే నెల(డిసెంబర్) 9 వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ వేడుక జరుగనున్నట్లు ఇన్విటేషన్లో వెల్లడించారు. ఈ శుభకార్యానికి హైదరాబాద్ లోని జీవీకే హౌస్ వేదిక కానుంది. ఎంతో వైభవంగా జరిగే నిక్షితార్ధానికి సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలతో పాటు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు.

ఆత్మీయుల సమక్షంలోనే పెళ్లి ముహుర్తాన్ని ఇరుకుటుంబాల వారు నిర్ణయించనున్నారు.  అక్కినేని ప్రిన్స్ అఖిల్, తన బాల్య మిత్రురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రీయ భూపాల్ ని ప్రేమించారు. వీరిద్దరి ప్రేమకు ఇంట్లో వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఒకటికానున్నారు. అన్ననాగ చైతన్య కంటే ముందుగానే అఖిల్ కళ్యాణం జరుగుతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus