SSMB28: మహేష్- త్రివిక్రమ్ మూవీలో అక్కినేని హీరో కీలక పాత్రట..!

  • May 8, 2021 / 12:38 PM IST

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ తరువాత 3వ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వడమో లేదా రెండు సినిమాల షూటింగ్లు ఏకకాలంలో జరగడం వంటిది జరుగుతుంది అని ఇండస్ట్రీ పండితులు చెప్పుకొస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో మాదిరి ఈ చిత్రంలో కూడా మరో హీరోకి స్పేస్ ఉంటుందట. అందులో సుశాంత్ చేసినట్టు.. ఈ సినిమాలో సుధీర్ బాబు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదనేది ఇన్సైడ్ టాక్. మహేష్ బాబు సినిమాలో కూడా త్రివిక్రమ్ మరో అక్కినేని హీరోని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడట. అతను మరెవరో కాదు సుమంత్. నిజజీవితంలో సుమంత్.. త్రివిక్రమ్ కు మరియు మహేష్ బాబు లకు మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే.

హిట్లు లేకపోయినా సుమంత్ మంచి పాత్రలనే ఎంపిక చేసుకుని చేస్తున్నాడు. పక్క హీరోల సినిమాల్లో కూడా మంచి పాత్రలు దొరికితే నటించడానికి తనకు అభ్యంతరం లేదని కూడా తెలిపాడు.అన్నట్టు గానే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఎన్టీఆర్ మహా నాయకుడు’ సినిమాల్లో కీలక పాత్రను పోషించాడు. దాదాపు మహేష్ సినిమాలో ఇతను ఫిక్స్ అయినట్టే అని వినికిడి. ఇక హీరోయిన్లుగా పూజా హెగ్డే, నిధి అగర్వాల్ పేర్లు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus