సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అలా నిన్ను చేరి’ నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల

  • October 30, 2023 / 09:12 PM IST

మంచి ఫీల్ గుడ్ మూవీలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. అందులోనూ లవ్ స్టోరీ, ఎమోషనల్ కథలకు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. అలాంటి ఓ ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ స్టోరీతో రాబోతోన్న చిత్రమే ‘అలా నిన్ను చేరి’. అన్ని రకాల అంశాలను జోడించిన తెరకెక్కించిన ఈ మూవీలో దినేష్ తేజ్ హీరోగా.. అందాల తారలు హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా మీద మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. మంచి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.

కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ నవంబర్ 10న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ప్రధానబలంగా నిలవనుంది. కోటగరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఆండ్రూ కెమెరా పనితనం ప్రేక్షకులను మెప్పించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus