Swathi Reddy: స్ట్రాంగ్ రీ ఎంట్రీకి ప్లాన్ .. రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టింది..!

  • July 2, 2021 / 10:10 PM IST

స్వాతి రెడ్డి.. ఇలా చెబితే జనాలకు వెంటనే స్ట్రైక్ అవ్వకపోవచ్చు.. అదే కలర్స్ స్వాతి అంటే వెంటనే స్ట్రైక్ అవుతుంది. ‘కలర్స్’ షో ద్వారా 15 ఏళ్లకే యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన స్వాతి ఆ తరువాత ‘డేంజర్’ ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.. అటు తరువాత అంటే 2008 లో ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోయిన్ గా కూడా మారింది. అది సూపర్ హిట్ అవ్వడంతో ‘గోల్కొండ హైస్కూల్’ ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాల్లో ఈమెకు అవకాశాలు లభించాయి.

అటు తర్వాత వికాస్ వాసుని ప్రేమ వివాహం చేసుకుని విదేశాలకి చెక్కేసింది. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నిఖిల్ ‘కార్తికేయ2’ లో నటిస్తుంది. దీంతో పాటు మరో రెండు చిత్రాల్లో నటించడానికి కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇందులో ‘పంచతంత్రం’ మూవీ కూడా ఒకటి.హర్ష పులిపాక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కరోనా ఉదృతి తగ్గిన వెంటనే ఈ సినిమాలు విడుదలవుతాయి.

ఈ రెండు సినిమాలతో తనకి పూర్వవైభవం లభిస్తుందని ఆశపడుతోంది స్వాతి. సినిమాకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని చెబుతుంది ఈ అమ్మడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల్లో సినిమాల్లో చిన్న పాత్రలు వచ్చినా వదులుకోను అని చెబుతుంది ఈ అమ్మడు. చూస్తుంటే స్వాతి.. రీ ఎంట్రీని గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus