Janhvi Kapoor: జాన్వీ కపూర్ కంటే ముందే టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయింది..!

  • May 25, 2021 / 06:45 PM IST

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో తెరంగేట్రం చేసి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ‘గుంజన్ సక్సేనా’ అనే బయోపిక్ లో కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు శ్రీదేవి కూతురి రేంజ్ మూవీస్ కాదు అని కొంతమంది పెదవి విరిచారు. పైగా జాన్వీ రెండో చిత్రం ఓటిటి లో విడుదలవ్వడం పట్ల వారు చాలా డిజప్పాయింట్ అయ్యారు. దాంతో దక్షిణాదిలో ఈమెను లాంచ్ చేసేటప్పుడు స్టార్ హీరోల సినిమాలతో మాత్రమే లాంచ్ చెయ్యాలి అని బోణి కపూర్ భావిస్తున్నారట.

అందుకే సౌత్ లో జాన్వీ కపూర్ ఎంట్రీ లేట్ అవుతుంది. అయితే ఈమె చెల్లి… శ్రీదేవి రెండో కుమార్తె అయిన ఖుషి కపూర్ మాత్రం అతి త్వరలో సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది అని కథనాలు వినిపిస్తున్నాయి.అది కూడా మొదట టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. ఈ మధ్యనే ఖుషి కపూర్ యాక్టింగ్ కు సంబంధించిన కోర్సు పూర్తిచేసిందట. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న ఓ యాక్టింగ్ స్కూల్ లో ఈమె శిక్షణ తీసుకుని.. ఈ మధ్యనే ముంబై తిరిగి వచ్చిందనట్టు సమాచారం.

దాంతో కరణ్ జోహార్, బోనీకపూర్ లు ఈమెను కూడా హీరోయిన్ గా లాంచ్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఆల్రెడీ మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు దిల్ రాజు ద్వారా బోణి కపూర్ ను సంప్రదిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న ‘పెళ్లి సందD’ సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు హీరోయిన్ పాత్ర కోసం ఖుషి ని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.కానీ అవి నిజం కాలేదు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus