వంగా బాలీవుడ్‌లో రెండో సినిమా షురూ చేస్తాడట

  • December 31, 2020 / 11:59 AM IST

తొలి ప్రయత్నంలోనే మరపురాని విజయాన్ని ఇచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ కథతో బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’ తీసి మెప్పించాడు సందీప్‌ రెడ్డి వంగా. మూడో సినిమా ఏంటి అని అందరూ అడుగుతున్నా… ఇన్నాళ్లూ ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతూ వచ్చిన సందీప్‌ బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్ సెట్‌ చేసుకున్నాడు. అది కూడా బాలీవుడ్‌. కపూర్‌ ఖాన్‌దాన్‌ హీరోనే పట్టేశాడు. అవును రణ్‌బీర్‌ కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి కొత్త సినిమా పట్టాలెక్కబోతోంది. కొత్త సంతవ్సరం కానుకుకగా ఈ రోజు అర్ధరాత్రి 12 తర్వాత సినిమా ప్రకటన చేస్తామంటూ చిత్రబృందం ప్రకటించింది.

మరి ఆ సర్‌ప్రైజ్‌లో ఏం చూపిస్తారనేది చూడాలి. తనతో ‘కబీర్‌ సింగ్‌’ నిర్మించిన టి-సిరీస్‌కే సందీప్‌ రెండో సినిమా చేస్తుండటం గమనార్హం. ఈ సినిమా కూడా తొలి సినిమా లాగే ప్రేమమయంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమా క్యాస్టింగ్‌ విషయంలో ఇంకా పూర్తిగా ఓ అవగాహన రానప్పటికీ ఇందులో ఆలియా భట్‌ హీరోయిన్‌గా ఉండొచ్చని అప్పుడే బాలీవుడ్‌లో చర్చలు మొదలైపోయాయి. ప్రేమ జంట ఈ సినిమాలో జంటగా నటిస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

చూద్దాం ఈ విషయం కూడా ఈ రోజు రాత్రి టీజర్‌ వీడియోలో చెప్పేస్తారేమో. ప్రస్తుత పరిస్థితుల్లో బాలీవుడ్‌ సినిమాలు మన దగ్గర డబ్బింగ్‌ అవ్వడం సాధ్యం కాదు కాబట్టి.. అక్కడ హిట్‌ కొట్టి ఆ సినిమాను టాలీవుడ్‌కు తీసుకొస్తాడేమో సందీప్‌.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus