పాన్ ఇండియా సినిమా అంటే తప్పదు మరి..!

  • June 30, 2020 / 04:28 PM IST

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. లాక్‌డౌన్‌కు కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు వైరస్ మహమ్మారి కారణంగా కేసులు పెరుగుతుండడంతో షూటింగ్ కు రావడానికి హీరో అల్లు అర్జున్ అండ్ టీం భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత అల్లు అర్జున్.. ‘రంగస్థలం’ చిత్రం తరువాత సుకుమార్.. చేస్తున్న చిత్రం కావడంతో ‘పుష్ప’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించాలి అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ‘పుష్ప’ ను పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో మొదటి నుండీ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. అయితే లాక్ డౌన్ నియమాలతో షూటింగ్ చెయ్యాలి కాబట్టి.. అడవి సెట్ ఇక్కడే వెయ్యాల్సి వస్తుందట. అంతేకాదు మిగిలిన లొకేషన్స్ లో చెయ్యాల్సిన షూటింగ్.. హైదరాబాద్ లోనే సెట్లు వేసి చిత్రీకరించేందుకు కూడా ‘పుష్ప’ టీం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

దీంతో మొదట అనుకున్న బడ్జెట్ కంటే..ఇప్పుడు రెండింతలు అయ్యే అవకాశం కనిపిస్తుందని టాక్. ఏకంగా ‘ప్రభాస్ 20’ బడ్జెట్ ను కూడా ‘పుష్ప’ దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ‘పుష్ప’ కు 200 కోట్ల పైనే బడ్జెట్ అవ్వబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus