మరో మసాలా ఎంటర్ టైనర్ కి ప్రిపేరవుతున్న అల్లు అర్జున్.!

  • March 27, 2018 / 10:33 AM IST

డైరెక్టర్ గా వరుస సినిమా అవకాశాలు అందుకోలేకపోయాడే కానీ ఒక మాస్ డైరెక్టర్ కి కావాల్సిన ఐడియాలజీతోపాటు అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్న డైరెక్టర్ సంపత్ నంది. రామ్ చరణ్ తో “రచ్చ” తెరకెక్కించిన తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా తీద్దామనుకొని దాదాపు ఏడాది వెయిట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కాదనడంతో నిర్మాతగా మారి “గాలిపటం” సినిమా నిర్మించిన సంపత్ నంది ఆ తర్వాత రవితేజతో “బెంగాల్ టైగర్”, గోపీచంద్ తో “గౌతమ్ నందా” చిత్రాలను తెరకెక్కించిన సంపత్ నంది ఆ సినిమాలతో తన డైరెక్షన్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోగలిగాడే తప్ప సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు.

అయితే.. తాజా సమాచారం ప్రకారం సంపత్ నంది తయారు చేసిన కథకు స్టైలిష్ స్టార్ బన్నీ ఒకే చెప్పాడట. ప్రస్తుతం “నా పేరు సూర్య” ఆ తర్వాత తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కనున్న లింగుస్వామి చిత్రం కోసం ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సంపత్ నంది సినిమా మొదలెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇన్నాళ్లపాటు వెయిట్ చేసినందుకు సంపత్ నందికి మంచి అవకాశమే దొరికిందని చెప్పుకొంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus