పైసా తీసుకోకుండా…యాక్ట్ చేసా!!!

  • December 26, 2016 / 06:19 AM IST

టాలీవుడ్ లో ఉన్న హీరోలే సరిపోవడంలేదు అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త హీరోలు ఎందరో పుట్టుకు వస్తున్నారు….అయితే అదే క్రమంలో కమీడీయన్స్ కూడా హీరోలుగా అవతారం ఎత్తుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి….అలా వచ్చిన హీరోల్లో సప్తగిరి ఒకరు….సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తో హీరోగా మారిన సప్తగిరి ఈ సినిమాలో హీరో పాత్ర మాత్రమే కాకుండా….ఇంకా చాలా భాద్యతలు నెత్తిన వేసుకున్నాడు….

తమిళంలో హిట్టయిన ‘తిరుడన్ పోలీస్’ను రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అతడిదేనట. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పుల్లోనూ అతడి భాగస్వామ్యం ఉంది. అందుకే ‘అడిషనల్ స్క్రీన్ ప్లే’ క్రెడిట్ కూడా తీసుకున్నాడు. ఐతే హీరోగా చేసి.. స్క్రిప్టులోనూ సహకారం అందించిన సప్తగిరి.. ఈ సినిమాకు పారితోషకం మాత్రం పైసా తీసుకోలేదని సమాచారం. అయితే ఈ విషయాన్ని సాక్షాతు సప్తగిరి చెప్పడమే విశేషం…ఎందుకలా అని అడిగితే…తాను హీరోగా సినిమా తీయడానికి నిర్మాత రవికిరణ్ ముందుకు రావడమే గొప్ప విషయమని.. అందుకే తనకు ఇచ్చే పారితోషకాన్ని నిర్మాత సినిమాకు ఖర్చు చేసుకుంటాడన్న ఉద్దేశంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా పూర్తి చేశానని సప్తగిరి ఈ మధ్య జరిగిన ఒక ఇంటెర్వ్యు లో చెప్పాడు.

ఇక సినిమా విషయానికి వస్తే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి…సొంతంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకున్న నిర్మాత లాభాలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. హీరోగా సప్తగిరి పాసైపోయాడని చెప్పలేం కానీ.. ఉన్నంతలో మెరుగైన ఫలితాన్నే అందుకున్నాడు. టాక్ డివైడ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్లయితే బాగానే వస్తున్నాయి ఈ చిత్రానికి. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో సినిమా బాగా ఆడుతోంది. మరి ఈ ఊపుతో సప్తగిరి హీరోగానే కొనసాగుతాడో లేకపోతే కమీడీయన్ గా సైతం ముందుకు సాగుతాడో చూడాలి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus