Nagarjuna: గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న అమలా పాల్, మెహ్రీన్.. కారణం అదే..!

  • November 17, 2021 / 07:27 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ‘శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ల పై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి ‘ఘోస్ట్’ అనే ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఫిలింలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ ను మొదట ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.

ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాల్గొనాల్సి ఉంది.అయితే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది. దీంతో మేకర్స్ అమలా పాల్ ను సంప్రదించారు. అయితే ఆమె పెద్ద మొత్తంలో పారితోషికం డిమాండ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టారు. టాలీవుడ్లో ఆమె రీ ఎంట్రీకి ఈ ప్రాజెక్టు మంచి ఛాయిసే కానీ ఎందుకో ఆమె తప్పుకుంది.అమలా పాల్ తో పాటు మెహ్రీన్ ను కూడా సంప్రదించారు దర్శకనిర్మాతలు.

ఆమె కూడా రూ.1 కోటి పై అడుగుతుందని ఆమెని కూడా లైట్ తీసుకున్నారట.ప్రస్తుతానికైతే మేకర్స్ ఏ హీరోయిన్‌ ను ఫైనల్ చేయలేదు.కాకపోతే అమలా పాల్, మెహ్రీన్ లకు ‘ఘోస్ట్’ మంచి ఛాయిసే. ఇందులో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus