పవన్, మహేష్ ల గురించి అమీషా పటేల్ ఏమి చెప్పిందంటే ?

  • March 8, 2017 / 11:46 AM IST

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నాని చిత్రంలో నటించింది. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నరసింహుడు చిత్రంలో ఆడి పాడింది. తాజాగా ఆకతాయి సినిమాలో అందాలు ఆరబోసింది. స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. ఈ మూవీ రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్, మహేష్ ల గురించి వివరించింది. “పవన్ నాకు ఎప్పటికీ స్పెషల్. ఎందుకంటే నాకు తెలుగులో తొలి హీరో అతనే. అంతే కాదు బద్రి సూపర్ హిట్ అయి నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఇక మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్. సెట్ లో చాలా సరదాగా ఉంటారు. తాను ఒక స్టార్ అనే సంగతిని పట్టించుకోరు. అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. నేను మాత్రం అతన్ని టాలీవుడ్ హృతిక్ రోషన్ అని పిలుస్తుంటాను” అని అమీషా స్టార్ హీరోలపై అభిమానాన్ని వెల్లడించింది. ఇక కొత్త నటీనటులు క్రమ శిక్షణ నేర్చుకోవాలంటే టాలీవుడ్ బాగా పనికొస్తుందని సూచించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus