20 ఏళ్ళ ‘ప్రియురాలు పిలిచింది’ ని రిజెక్ట్ చేసిన స్టార్లు ఎక్కువే..!

  • May 2, 2020 / 01:34 PM IST

రాజీవ్ మీనన్ డైరెక్షన్లో 2000వ సంవత్సరంలో వచ్చిన ‘ప్రియురాలు పిలిచింది’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. అజిత్, మమ్ముట్టి, అబ్బాస్, ఐశ్వర్య రాయ్, టబు వంటి స్టార్లు నటించిన మల్టీ స్టారర్ కాబట్టి ఈ చిత్రం పై అప్పట్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు తగినట్టు గానే ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. రాజీవ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ అందించిన సంగీతం మరో ప్లస్ అని చెప్పాలి. ‘గంధపు గాలిని’ పాట ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

అయితే ఇంత మంది స్టార్లు నటించిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను రిజెక్ట్ చేసిన స్టార్లు కూడా ఉన్నారు అని స్వయంగా దర్శకుడు రాజీవ్ మీనన్ చెప్పుకొచ్చాడు. ముందుగా అజిత్ పాత్ర కోసం ముందుగా ప్రశాంత్ ను అనుకున్నారట. కానీ అతను టబుకి జోడీగా అయితే చెయ్యలేను కావాలంటే … చెల్లెలి పాత్ర ఆయిన ఐశ్వర్య రాయ్ కు జోడీగా నటిస్తాను అని చెప్పాడట. అయితే అజిత్ ఆ టైములో యాక్సిడెంట్ కు గురయ్యే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అక్కడికి వెళ్ళి… అజిత్ బెడ్ పై ఉన్నప్పుడే కథ వివరించాడట రాజీవ్ మీనన్.

ఇక టబు చెల్లెలి పాత్ర ఐశ్వర్య రాయ్ చేసింది. అయితే ఈమె పాత్రకు ముందుగా సౌందర్య ను సంప్రదించాడట. అయితే అప్పటికి కథలో క్లయిమాక్స్ ఏంటని… సౌందర్య సోదరుడు అడిగాడు. నిజానికి అప్పటికి క్లయిమాక్స్ డిజైన్ చేయలేదట. అందుకే సౌందర్య ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి నిరాకరించినట్టు తెలుస్తుంది. ఇక ఐశ్వర్య రాయ్ కు జోడీగా అబ్బాస్ చేసాడు. ముందుగా విక్రమ్ తో ఈ పాత్ర చేయించాలి అనుకున్నాడట. కానీ కుదరక… డబ్బింగ్ చెప్పించి సరిపెట్టినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus