Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • May 22, 2021 / 11:29 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, ‘జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్’, ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత దర్శకుడు. ఆల్రెడీ దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. 30 రోజుల పాటు అక్కడ షూటింగ్ నిర్వహించారు.

అటు త‌ర్వాత హైదరాబాద్లో ఉగాది రోజున సెకండ్ షెడ్యూల్ ను నిర్వహించాలని ప్లాన్ చేశారు కానీ సెట్ లో నలుగురికి కరోనా రావడంతో ఆపేశారు. అయినప్పటికీ అనుకున్న టైంకి ఈ చిత్రాన్ని ఫినిష్ చేస్తామని దర్శకనిర్మాతలు ధీమాగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మే 31న విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కృష్ణ గారి పుట్టిన రోజున ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్ రాబోతుంది అన్న విషయం నిజమేనట.

కానీ అదే రోజున రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తారు అని సోషల్ మీడియాలో డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. అయితే వాటిలో నిజం లేదట..! ఆల్రెడీ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటన ఇచ్చారు. కాబట్టి.. మళ్ళీ సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు చెబుతారట.. కానీ విడుదల తేదీ ప్రకటించరట. మరోపక్క మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల సినిమా ఓపెనింగ్ కూడా ఇదే రోజున నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ లాక్ డౌన్ వల్ల అది కుదరకపోవచ్చు అని కూడా సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus