Mahesh Babu: సర్కారు వారి పాట సినిమాపై స్పందించిన ఆనంద్ మహీంద్ర!

  • May 31, 2022 / 10:29 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సర్కారు వారి పాట. గీతా గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 12వ తేదీ విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన వారం రోజులకే ప్రపంచవ్యాప్తంగా 160.2 కోట్ల గ్రాస్‌, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది.

ఇక ఈ సినిమా చూసిన ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై, మహేష్ బాబు నటన పై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర స్పందిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం సోషల్ మీడియా వేదికగా పలురకాల పోస్టులను చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే అనుపమ్‌ తరేజా పోస్ట్‌ చేసిన ఓ వీడియోకు స్పందనగా రీట్వీట్‌ చేశారు. ‘అన్‌బీటబుల్‌ కాంబినేషన్‌ అయిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌, జావా మెరూన్‌లను చూడకుండా ఎలా ఉండగలను అంటూ ఈయన సర్కారు వారి పాట సినిమా పై ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను న్యూయార్క్‌లో ఉన్నాను. న్యూ జెర్సీకి వెళ్లి సర్కారు వారి పాట సినిమా ఎక్కడున్నా చూస్తానని ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక ఆనంద్ మహీంద్ర స్వయంగా మహేష్ బాబు సినిమా గురించి స్పందించి ఇలాంటి ట్వీట్ చేయడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మీరు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus