Anasuya: రంగమ్మత్తకు మించి ఇంపాక్ట్ ఉంటుందట…!

  • May 5, 2021 / 03:51 PM IST

ఈ మధ్యనే ‘పుష్ప’ షూటింగ్లో పాల్గొన్నట్టు యాంకర్ అనసూయ తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. దాంతో ‘ఈ సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉండబోతుంది?’ అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే గతంలో అనసూయ.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించింది. ఈమె పాత్రను చాలా బాగా డిజైన్ చేసాడు సుకుమార్. అనసూయ కూడా ఈ పాత్రకు జీవం పోసిందనే చెప్పాలి. అందుకే ‘పుష్ప’ సినిమాలో అనసూయ పాత్ర ఎలా ఉండబోతుందా అనే డిస్కషన్లు మొదలయ్యాయి.

అయితే తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పుకొచ్చింది అనసూయ. ఇటీవల అనసూయ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ సినిమా గురించి స్పందించింది. ‘ఈ సినిమాలో నా పాత్ర గురించి పెద్దగా డీటెయిల్స్ చెప్పను..! కానీ గతంలో సుకుమార్ గారు ‘రంగస్థలం’ లో నా పాత్ర గురించి చెప్పినప్పుడు ఎంతటి ఇంపాక్ట్ కలిగిందో.. ‘పుష్ప’ సినిమాలో ఆయన నా పాత్ర గురించి చెప్పినప్పుడు అంతకు మించి ఇంపాక్ట్ కలిగింది.

నా పాత్ర కూడా ఓ రేంజ్లో ఇంపాక్ట్ కలిగించడం ఖాయం. ఇది మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ఇక ఈమె నటించిన ‘థాంక్యూ’ బ్రదర్ చిత్రం ఆహా ఓటిటిలో మే 7 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే..! దాంతో పాటు రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus