మోహన్ బాబు సినిమాలో అనసూయ సీరియస్ రోల్!

  • October 31, 2017 / 11:01 AM IST

గ్లామరస్ యాంకర్ గా, సీరియస్ ఆర్టిస్ట్ గా రెండు పడవల ప్రయాణం చేస్తున్న అనసూయ “క్షణం” తర్వాత లెక్కకు మిక్కిలి ఆఫర్లు వచ్చినప్పటికీ.. అవేమీ కాదని మోహన్ బాబు ప్రధాన పాత్రలో మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గాయత్రి” చిత్రాన్ని సైన్ చేసింది. ఈ సినిమాలో అనసూయ గ్లామరస్ అండ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా కనిపించనుందట. మోహన్ బాబుతో దాదాపుగా సమానమైన పాత్రలో అనసూయ కనిపించనుందట.

అలాగే.. రీసెంట్ గా శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా తెరకెక్కనున్న హారర్ కామెడీ “సచ్చిందిరా గొర్రె” చిత్రంలో అనసూయ కథానాయికగా కనిపించనుంది. త్వరలోనే బుల్లితెరపై వలె వెండితెర మీద కూడా ఫుల్ బిజీ అయ్యేందుకు అనసూయ రంగం సిద్ధం చేసుకొంటోంది. ఆమె ప్లానింగ్ సరిగ్గా వర్కవుట్ అయితే గనుక.. త్వరలోనే సెకండ్ హీరోయిన్స్ రోల్స్ కూడా చేసేందుకు అనసూయ రెడీ అన్నమాట.
అనసూయ కోసం ఆల్రెడీ కొందరు కొత్త దర్శకులు కథలు రెడీ చేసుకొన్నారట. ఇదివరకూ ఆ కథలను అనసూయ రిజెక్ట్ చేయగా.. ఇప్పుడు మళ్ళీ వారికి రిటర్న్ కాల్ చేసి త్వరలోనే తనను కలవమని, కాస్త ఆ కథలను అప్డేట్ చేయమని చెప్పిందట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus