Rashmi: ఆది అలా అనడంతో కంటతడి పెట్టుకున్న యాంకర్ రష్మి!

  • February 7, 2023 / 07:38 PM IST

కెరియర్ మొదట్లో వెండితెర నటిగా పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి రష్మీ వెండితెరపై పెద్దగా కలిసి రాకపోవడంతో వెండితెర సినిమాలకు గుడ్ బై చెబుతూ బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ రెండు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా

మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకొని పలు సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.త్వరలోనే ప్రేమికుల దినోత్సవం రావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం చెప్పు బుజ్జికన్నా అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ఎంతో సరదాగా గడిపారు.

అయితే చివరిలో FLAMES గేమ్ ఆడారు. ఇందులో మొదట వర్ష, ఇమ్మానుయేల్ మధ్య ఫ్లేమ్స్ చేయగా ఇద్దరికీ మ్యారేజ్ అని వచ్చింది. అనంతరం హైపర్ ఆది సుధీర్ రష్మీ పేర్లను ఫ్లేమ్స్ చేయబోతూ ఉండగా రష్మీ వెంటనే ఆది చేతిలోని పేపర్ చింపేసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విధంగా రష్మీ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకోవడంతో చాలామంది సుదీర్ ను గుర్తుచేసుకొని రష్మీ కన్నీళ్లు పెట్టుకున్నారు అంటూ కామెంట్లు చేస్తుండగా

మరి కొందరు మాత్రం మల్లెమాలవారు ఎపిసోడ్ పై హైప్ తీసుకురావడం కోసమే ప్రోమో ఇలా కట్ చేశారని… మల్లెమాల వారి పై మండిపడుతున్నారు మరి రష్మీ ఈ కార్యక్రమంలో ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారనే విషయం తెలియాలి అంటే ఆదివారం వరకు వేచి చూడాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus