Rashmi: నేటిజన్ తీరుపై మండిపడిన యాంకర్ రష్మీ!

  • January 24, 2024 / 04:38 PM IST

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రష్మీ ఒకరు. యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తరచూ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వారికి తన స్టైల్ లోనే ఈమె సమాధానం చెబుతూ ఉంటారు. తాజాగా మరోసారి ఒక నెటిజన్స్ చేసినటువంటి కామెంట్లపై రష్మీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రష్మీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఒక నేటిజన్ స్పందిస్తూ.. అసభ్యకరమైన పనులు చేస్తూ భగవంతుడి నామస్మరణ చేస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయా అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై యాంకర్ రష్మీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు రష్మీ రిప్లై ఇస్తూ నేనేమైనా టాక్స్ లు కట్టడం ఎగ్గొట్టానా ఎవరికైనా డబ్బు మోసం చేశానా బాధ్యత మరిచి తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేసానా మీ దృష్టిలో అసభ్యకరమైన పనులు అంటే ఏంటి? ఇటీవల కాలంలో ఇలాంటి మాటలు చాలా వింటున్నాను అంటూ ఈమె అసహనం వ్యక్తం చేశారు.

నా వరకు భగవంతుడు సర్వాంతర్యామి.. ఈ సనాతన ధర్మంలో మంచి విషయం అదే అంటూ (Rashmi) రష్మీ చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ విధంగా నెటిజన్ ప్రశ్నకు ఈమె తన స్టైల్ లో సమాధానం ఇవ్వడంతో పలువురు నెటిజెన్స్ సరైన సమాధానం చెప్పారు అంటూ ఈమెకు మద్దతు తెలియజేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సెలెబ్రెటీలను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసే వారి సంఖ్య అధికమైందనే చెప్పాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus