పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాను : ఆండ్రియా

  • August 10, 2019 / 07:05 PM IST

తెలుగులో ‘తడాకా’ చిత్రంలో సునీల్ పక్కన నటించింది కోలీవుడ్ నటి ఆండ్రియా. ఈ చిత్రంతో పాటు కమల్ హాసన్ ‘విశ్వరూపం’, సిద్దార్థ్ ‘గృహం’ చిత్రంలో కూడా నటించింది. ఇక తమిళంలో ఈవిడ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ఉంటుంది. ఆండ్రియా మంచి సింగర్ కూడా. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంలో కూడా ఓ పాట పాడింది. ఈమె బయట చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈమె సినిమాలు బాగా తగ్గించింది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘వాడా చెన్నై’ చిత్రం తర్వాత మరో సినిమా చేయలేదు.

దీనికి అసలు కారణం ఇది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో ప్రస్తుతం పలు ఈవెంట్స్ లో పాల్గొంటోంది ఆండ్రియా. ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాదుతూ.. ” ‘వాడా చెన్నై’ చిత్రం సమయంలో నేను పెళ్ళైన ఓ ప్రముఖ వ్యక్తితో రిలేషన్ షిప్ పెట్టుకున్నాను. కొన్ని రోజుల వరకు అతడు నాతో బాగానే ఉండేవాడు కానీ ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. అతని నుండీ దూరమయ్యాక బాగా డిప్రెషన్ కు గురయ్యాను. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ట్రీట్మెంట్ తర్వాత డిప్రెషన్స్ నుండీ కోలుకుని ప్రస్తుతం మళ్ళీ నా పనిలో బిజీ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరితో రిలేషన్ షిప్ పెట్టుకుందో ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus