మూడో నిర్మాణ సంస్థను మొదలు పెట్టనున్న అక్కినేని ఫ్యామిలీ!

  • December 23, 2017 / 06:59 AM IST

మెగాస్టార్ కుటుంబంలో రెండు బ్యానర్లున్నాయి. అల్లు అరవింద్ రెండు బ్యానర్లతో సినిమాలు చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి కూడా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ అనే రెండు బ్యానర్లు ఉన్నాయి. కొత్త బ్యానర్ పై అక్కినేని నాగార్జున కేవలం తనయులతో సినిమాలను నిర్మించనున్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహిస్తుంటారు. ఈ రెండే కాకుండా అక్కినేని కుటుంబంలో మరో బ్యానర్ రానుంది. అక్కినేని కోడలు సమంత భర్త నాగచైతన్య తో కలిసి ఈ నిర్మాణసంస్థను స్థాపించనున్నట్లు సమాచారం. కన్నడ మిస్టరీ సినిమా “యుటర్న్‌” రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు.

2016లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శ్రద్ధా శ్రీనాథ్‌, రోగర్‌ నారాయణ్‌, దిలీప్‌ రాజ్‌, రాధికా చేతన్‌ ల నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రద్ధా శ్రీనాథ్‌ పోషించిన జర్నలిస్ట్  పాత్రలో సమంత కనిపించనుంది. కన్నడ వెర్షన్ కి దర్సకత్వం వహించిన పవన్‌కుమార్‌  దీనిని తెలుగులోను దర్శకత్వం వహించనున్నారు.  స్క్రిప్ట్ వర్క్ జరుగుతోన్న ఈ సినిమాని కొత్త బ్యానర్లో నిర్మించడానికి సమంత ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో త్వరలో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus