Mahesh Babu: అక్కడ రికార్డు క్రియేట్ చేసిన మహేష్!

  • July 7, 2021 / 08:46 AM IST

గీతా గోవిందం సినిమా తరువాత స్టార్ హీరో పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ మూవీలో నటిస్తుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే బుక్ మై షోలో అరుదైన రికార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. ఇండస్ట్రీ హిట్స్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన మహేష్ సినిమాసినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

మహేష్ చివరి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లనే సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సర్కారు వారి పాటలో మహేష్ బ్యాంక్ ఆఫీసర్ గా కనిపిస్తారని గత సినిమాలతో పోల్చి చూస్తే మహేష్ బాడీ లాంగ్వేజ్ కూడా ఈ సినిమాలో భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ కామెడీ టైమింగ్ ఈ మూవీకి ప్లస్ అవుతుందని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బుక్ మై షోలో ఈ మూవీకి 25వేలకు పైగా ఇంట్రెస్టెడ్ లైక్స్ వచ్చాయి.

సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకుండా ఈ స్థాయిలో ఇంట్రెస్టెడ్ లైక్స్ సాధించడం మహేష్ కు మాత్రమే సాధ్యమైందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ రాకపోతే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని థర్డ్ వేవ్ వస్తే మాత్రం ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి సర్కారు వారి పాట సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus