సావిత్రి, ఎన్టీఆర్ ల తర్వాత ఏయన్నార్ బయోపిక్ రెడీ అవుతోంది!

  • May 30, 2018 / 08:11 AM IST

“మహానటి” సావిత్రి బయోపిక్ సూపర్ హిట్ అవ్వడం, ప్రస్తుతం “ఎన్టీఆర్” బయోపిక్ మేకింగ్ లో ఉండడంతో.. ఇప్పుడు ఉన్నపళంగా అక్కినేని నాగేశ్వర్రావు జీవితం ఆధారంగాను ఒక సినిమా రూపొందించే పనిలో ఉన్నారట నాగార్జున & టీం. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున & ఫ్యామిలీ నిర్మించనున్నారని వినికిడి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే.. ఈ ప్రొజెక్ట్ ను ఇమ్మీడియట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచన నాగార్జునకు లేదట. “ఎన్టీఆర్” ప్రొజెక్ట్ విడుదలయ్యాక ఆ రిజల్ట్ ను బట్టి “ఏయన్నార్” ప్రొజెక్ట్ మొదలెడతారట.

సో, “ఏయన్నార్” ప్రొజెక్ట్ మొదలయ్యాక కృష్ణ జీవితం ఆధారంగానూ సినిమా తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. చూస్తుంటే.. రానున్న అయిదారేళ్లలో మన తెలుగు టాప్ హీరోల జీవితాలు బయోపిక్ లుగా రూపొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా అనంతరం కొన్నాళ్లపాటు తెలుగులో మల్టీస్టారర్స్ ట్రెండ్ రన్ అయినట్లు.. ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus