మళ్ళీ తెరపైకి అక్కినేని..?

  • September 28, 2016 / 08:58 AM IST

ఏఎన్నార్.. అక్కినేని నాగేశ్వర రావు. రెండు వందలకు పైచిలుకు చిత్రాల్లో నటించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు. అక్కినేని త్రయం నటించిన ‘మనం’ సినిమాతో చిత్రసీమకు సెలవంటూ స్వర్గసీమకు తరలిన ఆయన మరోమారు తెరపైకి రానున్నారా అంటే అవున్నానే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

బాబా హథీరాం కథతో రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. నాగార్జున, అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేనివారిని చూపించాలన్న దిశగా చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నారట. గ్రాఫిక్స్ అంటే తెలియని కాలంలోనే ఈ మాయాజాలంతో ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకుడు కోడి రామకృష్ణ ప్రేరణతోనే ఈ ఆలోచనలో పడ్డారట దర్శకేంద్రుని బృందం. కోడి రామకృష్ణ తన తాజా చిత్రం ‘నాగాభరణం’ సినిమాలో కన్నడ నటుడు కీ.శే. విష్ణువర్ధన్ ని గ్రాఫిక్ ద్వారా పునఃసృష్టించారు. ఇదే రీతిన ఏఎన్నార్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని నాగ్ అప్పట్లో చెప్పుకొచ్చారు. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు. గతంలో రాఘవేంద్రరావు-నాగేశ్వరరావు – నాగార్జున కలయికలో భక్తిరస చిత్రం ‘శ్రీరామదాసు’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus