ఇక్కడికి వచ్చిన తరువాతే నాలో ఈ ధైర్యం వచ్చింది : అను ఇమ్యానుయేల్

  • April 28, 2018 / 08:23 AM IST

అమాయకంగా కనిపించే అను ఇమ్యానుల్ తొలిసారి మజ్ను సినిమాలో నాని సరసన ముద్దుగా నటించి అందరినీ ఆకట్టుకుంది. తర్వాత “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫెయిల్ కావడంతో ఆమె కెరీర్ కాస్త వేగం తగ్గింది. రెండు భారీ ప్రాజక్ట్స్ మిస్ అయ్యాయి. ఆక్సిజన్ అనే చిత్రం కూడా ఆశించినంత విజయం సాధించలేదు. అయినా ఆమె బాధపడకుండా తన ట్యాలెంట్ పై నమ్మకం పెట్టుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్రంలో నటించింది. ఈ మూవీలో కాస్త గ్లామర్ డోస్ పెంచింది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 4 న రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అను అనేక ఆసక్తికర విషయాలు చెప్పింది. సినిమాల్లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా తనకు ఎటువంటి ఈగోలు ఉండవని స్పష్టం చేసింది. తోటి నటితో స్నేహంగానే ఉంటానని వెల్లడించింది. మరి హీరోయిన్‌ అయిన తరువాత మీలో ఏమైనా అమర్పు వచ్చిందా? అన్న ప్రశ్నకు క్రేజీ సమాధానం చెప్పింది. “నామీద నాకు నమ్మకం చాలా పెరిగింది. గతంలో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, నలుగురు ఉన్నప్పుడు మాట్లాడాలన్నా భయపడేదాన్ని. ఇప్పుడలాంటి భయాలేమీ లేవు. ఎంత దూరంమైనా ఒంటరిగా వెళ్ళగలుగుతున్నాను. నలుగురితో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన తరువాతే నాలో ఈ ధైర్యంవచ్చింది. నటిగా నేను సాధించిన విజయం ఇదే” అని అను చెప్పింది. నా పేరు సూర్య తో పాటు “శైలజారెడ్డి అల్లుడు” సినిమాలో హీరోయిన్ గాను నటిస్తోంది. ఈ రెండు హిట్ అయితే టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus